అలాంటి సీన్లను ప్రజలు నాన్సెన్స్‌గా ఫీల్ అవుతారు : Kiara Advani

by Disha Web Desk 6 |
అలాంటి సీన్లను ప్రజలు నాన్సెన్స్‌గా ఫీల్ అవుతారు : Kiara Advani
X

దిశ, సినిమా : కామెడీ సినిమాలు చేయడం అనుకున్నంత సులభం కాదంటోంది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కియారా అద్వానీ. ఆమె నటించిన తాజా మూవీ 'గోవింద నామ్ మేరా' డిసెంబర్ 16న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న కియారా తన అనుభవాలను పంచుకుంది. హాస్యభరిత పాత్రలు చేయడం నటీనటులకు చాలా కష్టమని.. విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ కూడా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్‌ను కష్టతరంగానే భావిస్తున్నారని తెలిపింది. అలాగే కామెడీ మూవీస్‌కు తరచూ తగినంత క్రెడిట్ లభించదన్న నటి.. ప్రేక్షకులను నవ్వించేందుకు సెట్‌లో ఎంతో కష్టపడి పనిచేస్తే కొంతమంది దీన్ని చాలా తేలికగా చూస్తారని వాపోయింది. అంతేకాదు కామెడీ చేయడం రానప్పుడు ప్రేక్షకులు ఆ మనిషినే కామెడీగా భావిస్తారని, థియేటర్లో చిరాకు పడుతూ నాన్సెన్స్‌గా ఫీల్ అవుతారని పేర్కొంది. ఇక నటులే కాదు రచయిత లేదా దర్శకుడిని ఎవరినడిగినా ఇది కఠినమైన ప్రక్రియగానే చెబుతారని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Read More: ఈ శరీరంతో ఎప్పుడూ సంతోషంగా లేను : స్టార్ నటి

బ్లాక్ 'బ్రా' నుంచి ఎగిసిపడుతున్న అందాలు.. కుర్రాళ్లకు తడిసిపోయిందట



Next Story

Most Viewed